వేతనాల కోసం పారిశుధ్య కార్మికుల ధర్నా

ABN , First Publish Date - 2021-07-27T06:00:42+05:30 IST

వేతన బకాయిల కోసం మండలంలోని పారిశుధ్య కార్మికులు సోమవారం ఇక్కడి మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.

వేతనాల కోసం పారిశుధ్య కార్మికుల ధర్నా
మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట నినాదాలు చేస్తున్న కార్మికులు

 

గొలుగొండ, జూలై 26 : వేతన బకాయిల కోసం మండలంలోని పారిశుధ్య కార్మికులు సోమవారం ఇక్కడి మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సం దర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ పద్ధెనిమిది నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. ఎన్నాళ్లు ఆకలి మంటలతో పనిచేయా లని ప్రశ్నించారు. కరోనా వేళ ఇళ్ల నుంచి జనం బయటకు రావాలంటేనే హడలి పోయేవారని, ఆ సమయాల్లో కూడా ప్రాణాలకు తెగించి పనిచేసినందుకు తమకు ఇచ్చిన గుర్తింపు ఇదేనా అన్నారు.  అనంతరం ఎంపీడీవో డేవిడ్‌రాజ్‌కు వినతిపత్రం అందజేశారు. సంఘం ప్రతినిధులు తెరపల్లి సత్యనారాయణ, బంగా దారబాబు, కాగిత గంగరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-27T06:00:42+05:30 IST