సమస్యల పరిష్కారం కోరుతూ పారిశుధ్య కార్మికులు ధర్నా

ABN , First Publish Date - 2022-05-29T06:28:51+05:30 IST

అపరిష్కృత సమస్యల సరిష్కారం కోరుతూ శనివారం గాజువాక జోనల్‌ కార్యాలయ ఆవరణలో పారిశుధ్య కార్మికులు ధర్నా చేశారు,

సమస్యల పరిష్కారం కోరుతూ పారిశుధ్య కార్మికులు ధర్నా
గాజువాక జోనల్‌ కార్యాలయ ఆవరణలో ధర్నా చేస్తున్న పారిశుధ్య కార్మికులు

గాజువాక, మే 28: అపరిష్కృత సమస్యల సరిష్కారం కోరుతూ శనివారం గాజువాక జోనల్‌ కార్యాలయ ఆవరణలో పారిశుధ్య కార్మికులు ధర్నా చేశారు, ఈ సందర్భంగా ఏపీ మునిసిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధ్యక్షుడు జి.సుబ్బారావు మాట్లాడుతూ పారిశుధ్య కార్మికుల స్వీపర్లకు హెల్త్‌ అలెవెన్స్‌  నిలుపుదల చేయడం అన్యాయమన్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్‌ హెల్త్‌ అలెవెన్స్‌ రూ.6000 ప్రకటిస్తూ జీవోపై సంతకం చేసి నేడు నిలుపుదల చేయడం సరైన పద్ధతి కాదన్నారు. ఈఽ కార్యక్రమంలో గొలగాని అప్పారావు, రాము, నాగరాజు పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-29T06:28:51+05:30 IST