గ్రామాల్లో పారిశుధ్య పనులు
ABN , First Publish Date - 2021-05-10T04:33:50+05:30 IST
కరోనా విజృంభిస్తున్న తరుణంలో గ్రామాల్లో పరిశుభ్రత పాటించడం లేదని ఆది వారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘పరిశుభ్రత గాలికి..’ శీర్షికతో ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. డీపీవో ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో పారిశుధ్య పనులు చేయించారు.
నరసన్నపేట, మే 9: కరోనా విజృంభిస్తున్న తరుణంలో గ్రామాల్లో పరిశుభ్రత పాటించడం లేదని ఆది వారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘పరిశుభ్రత గాలికి..’ శీర్షికతో ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. డీపీవో ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో పారిశుధ్య పనులు చేయించారు. కాలువల్లోని మురుగు తొలగించడంతో పాటు బావుల్లో క్లోరినేషన్ చేపట్టారు. వీధుల్లో హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ చేశారు. మడపాం, పోతయ్యవలస, తామరాపల్లి, జమ్ము, కిళ్లాంల్లో ఆదివారం పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టినట్లు కార్యదర్శులు తెలిపారు.