TS News: శివునిపల్లి చేరుకున్న బండి సంజయ్

ABN , First Publish Date - 2022-08-26T03:18:09+05:30 IST

Janagama: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ స్టేషన్ ఘనపూర్ మండలం శివునిపల్లి చేరుకున్నారు. రాత్రికి శ్రీఖర పంక్షన్ హాల్ లో బస చేస్తారు. రేపు (శుక్రవారం) ఉదయం 8 గంటలకు పాంనూర్ నుంచి పాదయాత్ర మొదలుపెడతారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జనగామ జిల్లాలో బండి సంజయ్‌ పాదయాత్ర నిలిపివేయాలని

TS News: శివునిపల్లి చేరుకున్న బండి సంజయ్

Janagama: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ స్టేషన్ ఘనపూర్ మండలం శివునిపల్లి చేరుకున్నారు. రాత్రికి శ్రీఖర పంక్షన్ హాల్ లో బస చేస్తారు. రేపు (శుక్రవారం) ఉదయం 8 గంటలకు పాంనూర్ నుంచి పాదయాత్ర మొదలుపెడతారు.

ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జనగామ జిల్లాలో బండి సంజయ్‌ పాదయాత్ర నిలిపివేయాలని వర్దన్నపేట ఏసీపీ బండి సంజయ్‌కి నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై బండి సంజయ్ హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు ఇచ్చిన నోటీసును కోర్టు సస్పెండ్ చేసింది. దీంతో బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ పాదయాత్రకు మార్గం సులువైంది. ఈనెల 27వతేదీ మధ్యాహ్నం వరకు బండి సంజయ్ పాదయాత్ర చేస్తారు. అదే రోజు హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ వద్ద జరిగే బహిరంగ సభను నిర్వహించనున్నారు. 

Updated Date - 2022-08-26T03:18:09+05:30 IST