సంక్రాంతి ఆదాయం రూ.119 కోట్లు

ABN , First Publish Date - 2022-01-21T15:18:48+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి సందర్భంగా నడిపిన ప్రత్యేకబస్సుల ద్వారా రవాణా సంస్థకు రూ.119 కోట్ల మేర ఆదాయం వచ్చిందని ఆ సంస్థ అధికారులు ప్రకటించారు. పండుగ ముందు ఈనెల 11 నుంచి 13 వరకు, పండుగ

సంక్రాంతి ఆదాయం రూ.119 కోట్లు

చెన్నై: రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి సందర్భంగా నడిపిన ప్రత్యేకబస్సుల ద్వారా రవాణా సంస్థకు రూ.119 కోట్ల మేర ఆదాయం వచ్చిందని ఆ సంస్థ అధికారులు ప్రకటించారు. పండుగ ముందు ఈనెల 11 నుంచి 13 వరకు, పండుగ తర్వా త ఈ నెల 17 నుంచి 19 వరకు ఆరురోజులపాటు 16,500 ప్రత్యేక బస్సులు నడిపినట్లు తెలిపారు. సంక్రాంతి పండుగ ముందు మూడు రోజులు ప్రత్యేక బస్సుల్లో సుమారు ఐదు లక్షల మంది ప్రయాణించారు. తద్వారా సంస్థకు రూ.62 కోట్ల మేర ఆదాయం లభించింది. ఇదేవిధంగా పండుగ తర్వాత మూడు రోజుల పాటు నడిపిన ప్రత్యేక బస్సుల్లో 4.5లక్షల మంది ప్రయాణించడం ద్వారా సంస్థకు రూ.57 కోట్ల మేరకు ఆదాయం వచ్చిందని అధికారులు పేర్కొన్నారు

Updated Date - 2022-01-21T15:18:48+05:30 IST