పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తికి చేయూత
ABN , First Publish Date - 2020-12-04T05:07:47+05:30 IST
కొంతకాలంగా పక్షవాతంతో బాధపడుతుండగా రక్ష వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులను, పండ్లను గురువారం పంపిణీ చేశారు.
కొమరోలు, డిసెంబరు 3 : మండలంలోని తాతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తిరుపతయ్య గత కొంతకాలంగా పక్షవాతంతో బాధపడుతుండగా రక్ష వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులను, పండ్లను గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలను ఆదుకునేందుకు రక్ష వెల్ఫేర్ ఫౌండేషన్ ఎప్పుడూ ముందుంటుందన్నారు. కార్యక్రమంలో రక్ష ఫౌండేషన్ అధ్యక్షుడు పోలేపల్లె రంగజనార్థన్, సభ్యులు పాలమూరి వెంకటేశ్వర్లు, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.