సారా తయారీదారులపై ఉక్కుపాదం
ABN , First Publish Date - 2021-04-18T06:13:13+05:30 IST
సారా తయారీ దారులపై ఉక్కుపాదం మోపుతామని ఎస్సీ రవీంద్రనాథ్ బాబు అన్నారు. జిల్లా వ్యాప్తంగా 23 పోలీసు స్టేషన్ల పరిధిలో స్వాధీనం చేసుకున్న 5,205 లీటర్ల సారా, 15,485 కిలోల బెల్లం, 440 కిలోల పటికను శనివారం జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో శనివారం ధ్వంసం చేశారు.
ఎస్పీ రవీంద్రనాథ్బాబు
మచిలీపట్నం టౌన్ , ఏప్రిల్ 17 : సారా తయారీ దారులపై ఉక్కుపాదం మోపుతామని ఎస్సీ రవీంద్రనాథ్ బాబు అన్నారు. జిల్లా వ్యాప్తంగా 23 పోలీసు స్టేషన్ల పరిధిలో స్వాధీనం చేసుకున్న 5,205 లీటర్ల సారా, 15,485 కిలోల బెల్లం, 440 కిలోల పటికను శనివారం జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో శనివారం ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 472 నాటుసారా తయారీ కేంద్రాలపై దాడులు జరిపి 472 కేసులు నమోదుచేశామన్నారు. ఎన్ ఫోర్సుమెంట్ ఏఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూసారా తయారు చేస్తున్న నలుగురిపై పీడీ యాక్టు నమోదు చేసామన్నారు. స్పెషల్ బ్రాంచి డీఎస్పీ ధర్మేంద్ర, స్పెషల్ బ్రాంచ్ సీఐ నాగేంద్రకుమార్, చిలకలపూడి సీఐ అంకబాబు, శంకరయ్య, డేగ ప్రభాకర్ పాల్గొన్నారు.
16 మందికి రివార్డులు
విధి నిర్వహణలో ప్రతిభను కనపరచిన 16 మంది పోలీసు అధికారులకు, సిబ్బందికి ఎస్పీ రివార్డులు అందించారు.