విద్యార్థులందరికీ విద్యాకానుక కిట్లు అందాలి

ABN , First Publish Date - 2020-12-03T05:32:23+05:30 IST

సర్పవరం జంక్షన్‌, డిసెంబరు 2: ప్రతీ ఒక్క విద్యార్థికీ ప్రభుత్వం చేకూర్చిన జగనన్న విద్యాకానుక కిట్లు అందించాలని సర్వశిక్షాభియాన్‌ ఏపీవో బి.విజయభాస్కర్‌ ఆదేశించారు. కాకినాడ రూరల్‌ మండలం రమణయ్యపేట విద్యావనరుల కేంద్రాన్ని ఆయన బుధవారం పరిశీలించారు.

విద్యార్థులందరికీ విద్యాకానుక కిట్లు అందాలి
విద్యా వనరుల కేంద్రంలో రికార్డులు పరిశీలిస్తున్న ఏపీవో

సర్వశిక్షాభియాన్‌ ఏపీవో విజయభాస్కర్‌ 

సర్పవరం జంక్షన్‌, డిసెంబరు 2: ప్రతీ ఒక్క విద్యార్థికీ ప్రభుత్వం చేకూర్చిన జగనన్న విద్యాకానుక కిట్లు అందించాలని సర్వశిక్షాభియాన్‌ ఏపీవో బి.విజయభాస్కర్‌ ఆదేశించారు. కాకినాడ రూరల్‌ మండలం రమణయ్యపేట విద్యావనరుల కేంద్రాన్ని ఆయన బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొవిడ్‌ నిబంధనలకు లోబడి పాఠశాలలు పనిచేస్తున్నాయన్నారు. విద్యార్థులందరికీ బూట్లు అందించాలని, కొత్తగా చేరిన విద్యార్థుల సమాచారాన్ని అందించాలని ఎంఈవో గణే్‌షబాబును ఆదేశించారు. కార్పొరేట్‌ పాఠశాలలకు ధీటుగా నాడు-నేడు పథకంలో పాఠశాలల్లో పూర్తిస్థాయిలో మౌలిక వసతులను ప్రభుత్వం కల్పిస్తుందని ఆయన చెప్పారు. 

Updated Date - 2020-12-03T05:32:23+05:30 IST