విద్యార్థులందరికీ విద్యాకానుక కిట్లు అందాలి
ABN , First Publish Date - 2020-12-03T05:32:23+05:30 IST
సర్పవరం జంక్షన్, డిసెంబరు 2: ప్రతీ ఒక్క విద్యార్థికీ ప్రభుత్వం చేకూర్చిన జగనన్న విద్యాకానుక కిట్లు అందించాలని సర్వశిక్షాభియాన్ ఏపీవో బి.విజయభాస్కర్ ఆదేశించారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట విద్యావనరుల కేంద్రాన్ని ఆయన బుధవారం పరిశీలించారు.
సర్వశిక్షాభియాన్ ఏపీవో విజయభాస్కర్
సర్పవరం జంక్షన్, డిసెంబరు 2: ప్రతీ ఒక్క విద్యార్థికీ ప్రభుత్వం చేకూర్చిన జగనన్న విద్యాకానుక కిట్లు అందించాలని సర్వశిక్షాభియాన్ ఏపీవో బి.విజయభాస్కర్ ఆదేశించారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట విద్యావనరుల కేంద్రాన్ని ఆయన బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొవిడ్ నిబంధనలకు లోబడి పాఠశాలలు పనిచేస్తున్నాయన్నారు. విద్యార్థులందరికీ బూట్లు అందించాలని, కొత్తగా చేరిన విద్యార్థుల సమాచారాన్ని అందించాలని ఎంఈవో గణే్షబాబును ఆదేశించారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా నాడు-నేడు పథకంలో పాఠశాలల్లో పూర్తిస్థాయిలో మౌలిక వసతులను ప్రభుత్వం కల్పిస్తుందని ఆయన చెప్పారు.