Basara ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళనపై సర్కార్ సీరియస్
ABN , First Publish Date - 2022-06-18T17:18:22+05:30 IST
బాసర ట్రిపుల్ ఐటీ వద్ద విద్యార్థులు చేస్తున్న ఆందోళనపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది.
నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటీ వద్ద విద్యార్థులు చేస్తున్న ఆందోళనపై ప్రభుత్వం (Government) సీరియస్ అయ్యింది. క్యాంపస్కు సెలవులు ప్రకటించే యోచనలో సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. క్యాంపస్కు సెలవులిస్తే విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోతారని అధికారులు భావిస్తున్నారు. గతంలో విద్యార్థులు ఆందోళనలు చేసినప్పుడు ప్రభుత్వం సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.
కాగా... తమ సమస్యలను పరిష్కరించాంటూ గత ఐదు రోజులుగా విద్యార్థులు బాసర ట్రిపుల్ ఐటీ వద్ద ఆందోళనలు చేస్తున్నారు. వేలాదిగా విద్యార్థులు ట్రిపుల్ ఐటీ గేటే వద్ద బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి ఘటనలు జరుగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.