Americaలో దుమ్ము లేపుతున్న ‘సర్కారు వారి పాట’

ABN , First Publish Date - 2022-05-22T00:23:59+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేశ్ తొలిసారి జంటగా నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా దుమ్ము లేపుతోంది. కోట్లు కొల్లగొడుతూ విజయవంతంగా దూసుకువెళ్తోంది. దర్శ

Americaలో దుమ్ము లేపుతున్న ‘సర్కారు వారి పాట’

ఓవర్సీస్ సినిమా: అగ్రరాజ్యం అమెరికాలో సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేశ్ తొలిసారి జంటగా నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా దుమ్ము లేపుతోంది. కోట్లు కొల్లగొడుతూ విజయవంతంగా దూసుకువెళ్తోంది. దర్శకుడు పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మే 12న విడుదల అవగా.. ఒక్క అమెరికాలో ఇప్పటి వరకు 2.2 మిలియన్ డాలర్ల (రూ.17కోట్లకుపైగా) గ్రాస్‌ వసూలు చేసింది. ఈ విషయాన్ని చిత్ర యునిట్ అధికారింగా ప్రకటించింది. తమ అభిమాన నటుడి సినిమా అగ్రరాజ్యంలో రికార్డు స్థాయిలో వసూలు చేస్తుండటంతో అభిమానల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 



ఇదిలా ఉంటే.. ఇక ఈ చిత్రం అగ్రరాజ్యంలో సుమారు 603 పైచిలుకు లొకేషన్స్‌లో విడుదలైంది. మహేశ్ కెరీర్‌లోనే యూఎస్‌లో ఇంత భారీగా విడుదలవడం ఇదే తొలిసారి. బ్యాంకింగ్ స్కామ్ వంటి డిఫరెంట్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి ఎస్ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, సుబ్బ‌రాజు, న‌దియా, త‌నికెళ్ల భ‌ర‌ణి  త‌దిత‌రులు ఇతర కీలక పాత్ర‌ల్లో నటించారు. 


Updated Date - 2022-05-22T00:23:59+05:30 IST