వారం రోజుల్లో ఆన్లైన్లో సర్వదర్శనం టోకెన్లు
ABN , First Publish Date - 2021-09-13T23:58:57+05:30 IST
సర్వదర్శనం టోకెన్లు ఆన్లైన్లో ఇచ్చేందుకు టీటీడీ ఏర్పాట్లు
తిరుమల: సర్వదర్శనం టోకెన్లు ఆన్లైన్లో ఇచ్చేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. తమిళులకు ముఖ్యమైన పెరటాశి మాసం ఈ నెల 18న ప్రారంభం కానుండడంతో ఆఫ్లైన్లో ఇస్తున్న సర్వదర్శనం టోకెన్లు టీటీడీ నిలిపివేయనుంది. వారం రోజుల్లో ఆన్లైన్లో సర్వదర్శనం టోకెన్లు టీటీడీ ఇవ్వనుంది. రోజుకు 8 వేల చొప్పున ఆన్లైన్లో సర్వదర్శనం టోకెన్లను విడుదల చేసే అవకాశం ఉంది.