డైట్లో సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహ ఆవిష్కరణ
ABN , First Publish Date - 2022-05-26T06:43:26+05:30 IST
స్థానిక డైట్ ఇంజినీరింగ్ కళాశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహాన్ని కళాశాల చైర్మన్ దాడి రత్నాకర్ బుధవారం ఆవిష్కరించారు.
అనకాపల్లిటౌన్, మే 25: స్థానిక డైట్ ఇంజినీరింగ్ కళాశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహాన్ని కళాశాల చైర్మన్ దాడి రత్నాకర్ బుధవారం ఆవిష్కరించారు. విద్యారంగానికి, దేశానికి సర్వేపల్లి చేసిన సేవలను ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. విగ్రహాల వేదిక పై మహానీయుల విజయాలను ఆవిష్కరించడం యువతరాలకు స్ఫూర్తినిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్.నరసింహం, పలు విభాగాల అధిపతులు పాల్గొన్నారు.