నిర్మల్కు చేరిన సాష్టాంగ నమస్కార యాత్ర
ABN , First Publish Date - 2022-01-22T07:02:00+05:30 IST
హిందూధర్మ పరిరక్షణలో భాగంగా విఠల్ స్వామి చేపట్టిన 2300 కిలోమీటర్ల సాష్టాంగ నమస్కారయాత్ర శుక్రవారం సాయంత్రం నిర్మల్కు చేరింది.
నిర్మల్ కల్చరల్, జనవరి 21 : హిందూధర్మ పరిరక్షణలో భాగంగా విఠల్ స్వామి చేపట్టిన 2300 కిలోమీటర్ల సాష్టాంగ నమస్కారయాత్ర శుక్రవారం సాయంత్రం నిర్మల్కు చేరింది. ఈ యాత్రకు సాయిబాబా ఆలయ సింగల్ ట్రస్ట్ చైర్మన్ లక్కడి జగన్మోహన్రెడ్డి అఖండ స్వాగతం పలికారు. విఠల్స్వామి లోకకల్యాణార్థం తమ వంతుగా మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం జలాల్పూర్ నుంచి జమ్మూకాశ్మీర్లోని వైష్ణోదేవి మందిరం వరకు నమస్కార యాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి నిర్మల్ సాయిబాబా ఆలయం లో శిష్యబృందంతో పాటు బసచేసి శనివారం బయలుదేరుతారు. యాత్రకు సహకరిస్తున్న వారికి విఠల్స్వామి భగవద్గీత గ్రంధాలు అందజేశారు. అయ్య న్న గారి శ్రీనివాస్, ఆకుల మహేష్, తదితరులు స్వామివారిని కలిశారు.