సత్యదేవ నిత్యాన్నదానానికి రూ.3.15 లక్షలు విరాళాలు
ABN , First Publish Date - 2021-03-01T06:01:28+05:30 IST
రత్నగిరిపై ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సత్యదేవ నిత్యాన్నదాన పథకానికి ఆదివారం పలువురు దాతల నుంచి రూ.3.15 లక్షలు విరాళాలుగా సమకూరాయి.
అన్నవరం, ఫిబ్రవరి 28: రత్నగిరిపై ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సత్యదేవ నిత్యాన్నదాన పథకానికి ఆదివారం పలువురు దాతల నుంచి రూ.3.15 లక్షలు విరాళాలుగా సమకూరాయి. యానానికి చెందిన బోనం శ్రీవెంకట సర్వేశ్వర అవినాష్ రూ.1,15,350 ఈవో త్రినాథరావు, చైర్మన్ రోహిత్లకు అందజేశారు. తణుకుకు చెందిన మరో భక్తుడు కాదంబరి సత్యవాణి రూ.1,01,000 ఈవోకు అందించారు. సంగారెడ్డికి చెందిన కె.పవన్కుమార్ రూ.లక్ష ఆలయ విభాగ ఏఈవో కృష్ణారావుకు అందజేశారు.