మూడేళ్లుగా ప్రజలను మోసం చేస్తున్న జగన్: సత్యకుమార్
ABN , First Publish Date - 2022-03-20T02:16:08+05:30 IST
ఏపీలో సీఎం జగన్మోహన్రెడ్డి మూడేళ్లుగా ప్రజలను మోసం చేస్తు న్నాడని బీజేపీ జాతీయనేత సత్యకుమార్ అన్నారు.
కడప: ఏపీలో సీఎం జగన్మోహన్రెడ్డి మూడేళ్లుగా ప్రజలను మోసం చేస్తున్నాడని బీజేపీ జాతీయనేత సత్యకుమార్ అన్నారు. శనివారం రాయలసీమ రణభేరి సభలో మాట్లాడుతూ.. ఏపీలో కేంద్రం చేసిన అభివృద్ధిపై తప్ప జగన్ చేసిందేమి లేదన్నారు. రాయలసీమ నుంచి వచ్చిన ఏ ముఖ్యమంత్రి సీమ అభివృద్ధిని పట్టించుకోలేదని చెప్పారు. కడప జిల్లాలో పుట్టిన జగన్ కడప ఉక్కుఫ్యాక్టరిని గాలికి వదిలేశాడని మండిపడ్డారు. సీమలో అందరికీ అండగా నిలుస్తామని సత్యకుమార్ అన్నారు.