భారత్పై సౌదీ ప్రయాణ ఆంక్షలు
ABN , First Publish Date - 2022-05-24T08:58:37+05:30 IST
కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో.. భారత్ సహా 16 దేశాలపై సౌదీ అరేబియా ప్రయాణ ఆంక్షలు విధించింది.
మరో 15 దేశాలపై కూడా!
దేశంలో 14 వేలకు తగ్గిన కరోనా యాక్టివ్ కేసులు
కరోనా బాధితులకు పార్కిన్సన్స్ ముప్పు ఎక్కువ
అమెరికా పరిశోధకుల అధ్యయనం
న్యూఢిల్లీ, ముంబై: కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో.. భారత్ సహా 16 దేశాలపై సౌదీ అరేబియా ప్రయాణ ఆంక్షలు విధించింది. అయితే, భారతదేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 14,832కు తగ్గింది. మంగళవారం దేశవ్యాప్తంగా 2,022 కేసులు, 46 మరణాలు నమోదయ్యాయి. వీటితో కలిపి ఇప్పటిదాకా దేశంలో 4,31,38,393 కేసులు.. 5,24,459 మరణాలు నమోదయ్యాయి. కాగా.. కరోనా సోకినవారు భవిష్యత్తులో పార్కిన్సన్స్ బారిన పడే ప్రమాదం ఎక్కువని థామస్ జెఫర్సన్ వర్సిటీ, న్యూయార్క్ వర్సిటీ శాస్త్రజ్ఞులు ఎలుకలపై చేసిన పరిశోధనలో వెల్లడైంది. 1918లో స్పానిష్ ఫ్లూ మహమ్మారి వ్యాపించినప్పుడు కూడా ఇలాగే ప్రపంచవ్యాప్తంగా పార్కిన్సన్స్ కేసులు బాగా పెరిగాయని వారు గుర్తుచేస్తున్నారు.