రక్షించాల్సిన పోలీసులే భక్షిస్తున్నారు

ABN , First Publish Date - 2021-01-22T05:56:16+05:30 IST

ప్రజలను రక్షించాల్సిన పోలీసులే భక్షిస్తున్నారని తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి యనమల శివరామకృష్ణన్‌ అన్నారు.

రక్షించాల్సిన పోలీసులే భక్షిస్తున్నారు

  • తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి శివరామకృష్ణన్‌
  • టీడీపీ నేత కళా వెంకట్రావు అక్రమ అరెస్టుకు నిరసన

తుని, జనవరి 21: ప్రజలను రక్షించాల్సిన పోలీసులే భక్షిస్తున్నారని తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి యనమల శివరామకృష్ణన్‌ అన్నారు. టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు అక్రమ అరెస్టుకు నిరసనగా గురువారం జిల్లాలో పలుచోట్ల కార్యక్రమాలు నిర్వహించారు. తునిలో స్థానిక కన్యకాపరమేశ్వరి ఆలయం వద్ద గాంధీజీ విగ్రహానికి శివరామకృష్ణన్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ, బీసీలపై దాడులు పెరిగిపోయాయన్నారు. అలాగే 150 హిందూ విగ్రహాలు ధ్వంసమయ్యాయన్నారు. వీటిని ప్రశ్నించిన నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారన్నారు. అయితే న్యాయం పక్కన ఉండాల్సిన పోలీసులు, ప్రభుత్వం చేతుల్లో కీలుబొమ్మల మారిపోయారన్నారు. కార్యక్రమం లో పార్టీ పట్టణాధ్యక్షుడు యినుగంటి సత్యనారాయణ, కుక్కడపు బాలాజీ, మళ్ల గణేష్‌, శిల్పరశెట్టి జగన్మోహన్‌, దిబ్బ శ్రీను, అల్లు రాజు, నెల్లిపూడి బ్రహ్మాజీ, రాజుబాబు, నారాయణరావు, గూటాల అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-22T05:56:16+05:30 IST