ప్రజల ప్రాణాలను కాపాడండి

ABN , First Publish Date - 2021-05-07T06:50:54+05:30 IST

కరోనా ఉధృ తం అవుతోందని ప్రజల ప్రాణా లను కాపాడాలని వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ చార్జి ఆది శ్రీనివాస్‌ సూచించారు.

ప్రజల ప్రాణాలను కాపాడండి
మాట్లాడుతున్న ఆది శ్రీనివాస్‌

- వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి ఆది శ్రీనివాస్‌ 

చందుర్తి, మే 6: కరోనా ఉధృ తం అవుతోందని ప్రజల ప్రాణా లను కాపాడాలని వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ చార్జి ఆది శ్రీనివాస్‌ సూచించారు. చందుర్తి మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో కరోనా తో మృతి చెందిన మృతుల కు టుంబాలను గురువారం పరామ ర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ హైకోర్టు, సుప్రీం కోర్టులు కరోనా కట్టడిపై తగు చర్యలు తీసుకోవాలని హెచ్చరి కలు జారీ చేసినప్పటికీ సీఎస్‌ సోమేష్‌కుమార్‌ లాక్‌డౌన్‌ అవసరం లేదని చెప్పడం  విడ్డూరంగా ఉందన్నారు. కరోనా వ్యాధితో మృతి చెందిన కుటుం బాలకు రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలన్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్స్‌ దొరకక ప్రైవేటు ఆసు పత్రుల్లో వైద్యం చేయించుకున్న వారికి ఆరోగ్యశ్రీ కింద బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆయన వెంట జడ్పీటీసీ నాగం కుమార్‌,  కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు చింతపంటి రామస్వా మి, నాయకులు గొట్టె ప్రభాకర్‌, పులి సత్తయ్య, మర్రి మల్లేశం, మల్లారపు రాజయ్య తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-05-07T06:50:54+05:30 IST