Q1లో జీడీపీ వృద్ధి 18,5 శాతం : ఎస్బీఐ నివేదిక
ABN , First Publish Date - 2021-08-24T20:30:30+05:30 IST
భారత దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ప్రస్తుత
ముంబై : భారత దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని తొలి త్రైమాసికంలో దాదాపు 18.5 శాతం ఉండవచ్చునని భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) అంచనా వేసింది. ఇది భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) అంచనా కన్నా తక్కువ కావడం గమనార్హం.
ఎస్బీఐ విడుదల చేసిన ఇకోరాప్ రీసెర్చ్ రిపోర్టు ప్రకారం, 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత దేశ జీడీపీ వృద్ధి 18.5 శాతం ఉంటుంది. అయితే ఆర్బీఐ మాత్రం ఈ కాలంలో జీడీపీ వృద్ధి రేటు 21.4 శాతం ఉంటుందని అంచనా వేసింది.
నౌకాస్టింగ్ మోడల్ ఆధారంగా 2021-22 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత దేశ జీడీపీ వృద్ధి అంచనా (అప్వార్డ్ బయస్తో) దాదాపు 18.5 శాతం అని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక తెలిపింది.
41 హై ఫ్రీక్వెన్సీ ఇండికేటర్స్తో నౌకాస్టింగ్ మోడల్ను ఎస్బీఐ రూపొందించింది. పారిశ్రామిక కార్యకలాపాలు, సేవా రంగం కార్యకలాపాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వంటివాటి ఆధారంగా దీనిని అభివృద్ధిపరిచింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో గ్రాస్ వాల్యూ యాడెడ్ (జీవీఏ) 15 శాతం అని ఈ నివేదిక అంచనా వేసింది.