Babri demolition case: యూపీ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్పై బాబ్రీ మసీదు కూల్చివేత కేసు ఎత్తివేత...సుప్రీంకోర్టు నిర్ణయం
ABN , First Publish Date - 2022-08-30T18:21:45+05:30 IST
ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, దివంగత కళ్యాణ్ సింగ్పై బాబ్రీ మసీదు కూల్చివేత(Babri demolition case)ధిక్కార కేసును సుప్రీంకోర్టు(Supreme Court)...
న్యూఢిల్లీ:ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, దివంగత కళ్యాణ్ సింగ్పై బాబ్రీ మసీదు కూల్చివేత(Babri demolition case)ధిక్కార కేసును సుప్రీంకోర్టు(Supreme Court) ఎత్తివేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అయోధ్యలోని(Ayodhya) బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో మాజీ సీఎం కళ్యాణ్ సింగ్(former UP CM Kalyan Singh) తదితరులపై దాఖలైన ధిక్కార కేసును సుప్రీంకోర్టు ముగించింది.(Supreme Court has closed)పిటిషనర్ కళ్యాణ్ సింగ్ మరణాన్ని ఉటంకిస్తూ బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో దివంగత నేత కోర్టు ధిక్కారానికి సంబంధించిన కేసును సుప్రీం ఎత్తివేసింది.
2019 అయోధ్య తీర్పు నేపథ్యంలో ఈ కేసు అంశం మనుగడలో లేదని సుప్రీం పేర్కొంది. యూపీ ప్రభుత్వం(UP government) భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, రథయాత్ర, బాబ్రీ కూల్చివేతలను సర్కారు అనుమతించినందున కళ్యాణ్ సింగ్, ఇతరులపై ధిక్కార కేసు పెట్టారు.(contempt matter against Kalyan Singh) మాజీ సీఎం మరణించినందువల్ల ఈ కేసును మూసివేసింది. అయోధ్య తీర్పు వల్ల(Ayodhya verdict)బాబ్రీ మసీదు కూల్చివేత వల్ల ఉత్పన్నమయ్యే ఇతర కేసులు ప్రభావితం కావు.