AP ప్రభుత్వంపై ఎస్సీ మహిళ ఆగ్రహం.. దడిచేదేలే అంటూ ఫైర్
ABN , First Publish Date - 2022-05-17T00:10:08+05:30 IST
ఏపీ ప్రభుత్వంపై ఎస్సీ మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు చేసిందేమీ లేదంటూ ఆరోపించారు. అర్హులైన తమకు పథకాలు ఇవ్వడంలేదని..
గుంటూరు: ఏపీ ప్రభుత్వంపై ఎస్సీ మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు చేసిందేమీ లేదంటూ ఆరోపించారు. అర్హులైన తమకు పథకాలు ఇవ్వడంలేదని ఆమె ఘాటుగా విమర్శించారు. ఈసారి ఎన్నికల్లో జగన్ గెలవడని బహిరంగంగానే చెప్పారు. తాను ఎవరికీ బయటపడేది లేదని.. అవసరమైతే ఫొటో తీసుకోండని.. ఎట్టి పరిస్థితుల్లోనూ దడిచేదిలేదని వ్యాఖ్యానించారు. మాస్క్ తీసి మరీ తన ఫొటో పేపర్లో వేసుకోండని ఆమె ముఖం చూపిస్తూ మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.