ఎన్ఎంఎంఎస్ పరీక్షకు దరఖాస్తు గడువు పొడిగింపు
ABN , First Publish Date - 2021-01-25T06:03:19+05:30 IST
జాతీయస్థాయిలో వచ్చేనెల 14న జరిగే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్షకు దరఖాస్తు చేసుకునే గడువు పొడిగించినట్లు పరీక్షల విభాగం సంచాలకులు ఎ.సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
గుంటూరు(విద్య), జనవరి 24: జాతీయస్థాయిలో వచ్చేనెల 14న జరిగే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్షకు దరఖాస్తు చేసుకునే గడువు పొడిగించినట్లు పరీక్షల విభాగం సంచాలకులు ఎ.సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పరీక్షకు దరఖాస్తుచేసుకునే తేదీని ఈనెల 27 నుంచి 30వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపారు.