జగ్గాయిగూడెం పాఠశాలకు టీవీ, డీటీహెచ్‌ వితరణ

ABN , First Publish Date - 2021-07-27T04:47:54+05:30 IST

జగ్గాయిగూడెంలో పాఠశాలలో ఉపాధ్యాయులు లేకపోవడంతో గిరిజన విద్యార్థుల ఇబ్బందులపై ‘ఆంధ్రజ్యోతి’లో ‘ప్రభుత్వ పాఠశాల.. పట్టదేలా?’ శీర్షికన ఈనెల 21న కథనం ప్రచురితమైంది.

జగ్గాయిగూడెం పాఠశాలకు టీవీ, డీటీహెచ్‌ వితరణ
జగ్గాయిగూడెం గ్రామస్థులకు డీటీహెచ్‌ అందజేస్తున్న వరుణ్‌

ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన

గుండాల జులై 26: జగ్గాయిగూడెంలో పాఠశాలలో ఉపాధ్యాయులు లేకపోవడంతో గిరిజన విద్యార్థుల ఇబ్బందులపై ‘ఆంధ్రజ్యోతి’లో ‘ప్రభుత్వ పాఠశాల.. పట్టదేలా?’ శీర్షికన ఈనెల 21న కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండల కేం ద్రానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉధ్యోగి బసవ వరుణ్‌ విద్యార్థులు ఆన్‌లైన్‌ పాఠాలు వినేందుకు చేతన ఫౌండేషన్‌ భాగస్వామ్యంతో ఎల్‌ఈడీ టీవీ, డీటీహెచ్‌లను గ్రామస్థులకు అందించారు. పోతిరెడ్డిగూడేనికి చెందిన దివ్యాంగుడు పొట్టయ్యకు ట్రైసైకిల్‌ను అందజేశాడు. అగ్నిప్రమా దంలో సర్వం కోల్పోయిన ఈసం బక్కయ్య కుటుంబానికి రూ. నాలుగువేలు, నిత్యావసర సరు కులను అందజేశారు. కార్యక్రమంలో చేతన ఫౌండేషన్‌ సభ్యులు సత్తూలాల్‌, రషీద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-07-27T04:47:54+05:30 IST