అనుకోకుండా హెడ్‌మాస్టర్ గది వద్దకు వెళ్లిన విద్యార్థులు.. అక్కడ ఒక షాకింగ్ సీన్ చూసిన వారు ఏం చేశారంటే..

ABN , First Publish Date - 2022-02-01T06:51:40+05:30 IST

ఒక స్కూలులో 9వ తరగతి చదివే విద్యార్థులు కొందరు ఆడుకుంటూ హెడ్ మాస్టర్ గది వద్దకు వెళ్లారు. అక్కడ కిటికీలో నుంచి వారు చూడగా.. లోపల ఒక షాకింగ్ సీన్ కనపడింది. దీంతో వారు ఆ దృశ్యాన్ని మొబైల్ ఫోన్‌లో వీడియో తీశారు...

అనుకోకుండా హెడ్‌మాస్టర్ గది వద్దకు వెళ్లిన విద్యార్థులు.. అక్కడ ఒక షాకింగ్ సీన్ చూసిన వారు ఏం చేశారంటే..

ఒక స్కూలులో 9వ తరగతి చదివే విద్యార్థులు కొందరు ఆడుకుంటూ హెడ్ మాస్టర్ గది వద్దకు వెళ్లారు. అక్కడ కిటికీలో నుంచి వారు చూడగా.. లోపల ఒక షాకింగ్ సీన్ కనపడింది. దీంతో వారు ఆ దృశ్యాన్ని మొబైల్ ఫోన్‌లో వీడియో తీశారు. ఇప్పుడా ఆ వీడియో స్థానికంగా కలకలం రేపింది. ఎంతగా అంటే ఆ హెడ్ మాస్టర్‌ని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..


కర్ణాటక రాష్ట్రం మైసురు జిల్లా పరిధి హె డి కోట పట్టణంలోని ఒక పాఠశాలలో ఇటీవల ఒకరోజు 9వ తరగతి చదివే ఇద్దరు విద్యార్థులు సరదాగా తిరుగుతూ స్కూలు హెడ్ మాస్టర్ గది వద్దకు వెళ్లారు. అక్కడ కిటికీలో నుంచి చూడగా వారికి  ఒక షాకింగ్ దృశ్యం కనబడింది. హెడ్ మాస్టర్ ఆ స్కూలులో చదివే ఒక బాలికను ముద్దు పెట్టుకుంటున్నారు. ఈ సీన్ చూసిన ఆ విద్యార్థులు రహస్యంగా తమ మొబైల్ ఫోన్ తీసి వీడియో తీశారు. ఇంతలో ఆ హెడ్ మాస్టర్‌కి కిటికీ వద్ద ఏదో అలికిడి ఉన్నట్లు అనిపించింది. అప్పుడు ఆ బాలికను అక్కడి నుంచి పొమ్మని చెప్పి ఆయన కిటికీ వద్దకు వస్తుండగా.. ఆ విద్యార్థులు అక్కడి నుంచి పారిపోయారు.


ఆ తరువాత ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. దీంతో సదరు హెడ్ మాస్టర్ బాగోతం అందరి దృష్టికి వచ్చింది. ఇలాంటి హెడ్ మాస్టర్‌ను కఠినంగా శిక్షించాలంటూ స్థానికులు కోరుతుండగా.. ఆ ప్రాంత విద్యా ఉన్నతాధికారులు సదరు హెడ్ మాస్టర్‌ని ప్రస్తుతం సస్పెండ్ చేశారు. పోలీసులు ఆ హెడ్ మాస్టర్‌పై పోక్సో చట్ట ప్రకారం కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తెలిపారు.



Updated Date - 2022-02-01T06:51:40+05:30 IST