పాఠశాలలకు తాళం
ABN , First Publish Date - 2022-07-07T05:01:29+05:30 IST
పాఠశాల విలీనం వద్దంటూ విద్యార్థుల తల్లిదండ్రులు బుధవారం అనంపల్లె బడికి తాళం వేసి నిరసన తెలి పారు.
విలీనం వద్దంటూ ఆందోళన
రాచర్ల, జూలై 6 : పాఠశాల విలీనం వద్దంటూ విద్యార్థుల తల్లిదండ్రులు బుధవారం అనంపల్లె బడికి తాళం వేసి నిరసన తెలి పారు. 3, 4, 5 తరగతులు చదివే చిన్నారులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనబాట పట్టారు. మంగళవారం యడవల్లి పాఠశాలను విలీనం చేయొద్దంటూ నిరసన తెలపగా, బుధవారం మండలంలోని ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్న దాదాపు 80మంది విద్యార్థులను యూపీ స్కూలులో కల పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచి శిరిగిరి రమేష్ ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రాథమిక పాఠశాలకు తాళం వేసి ఆందో ళనకు దిగారు. రాచర్లలోని ఏబీఎం పాలెంలో ప్రాథమిక పాఠశాలలో చ దువుతున్న విద్యార్థులను జడ్పీ ఉన్నత పాఠశాలలో విలీనం చేయొద్దని రాచర్ల ఎంఈవో కార్యాలయం వద్ద తల్లిదండ్రులు నిరసన తెలిపారు.