విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలి
ABN , First Publish Date - 2022-01-22T04:56:09+05:30 IST
కొవిడ్ థర్డ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలని టీ డీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృ ష్ణారెడ్డి డిమాండ్ చేశారు.
అనపర్తి, జనవరి 21: కొవిడ్ థర్డ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలని టీ డీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృ ష్ణారెడ్డి డిమాండ్ చేశారు. మండలంలోని రామవరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారిక గణాంకాల ప్రకారం గడిచిన 20 రోజుల్లో కొవిడ్ వ్యాప్తి 26శాతం పెరిగిందన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయు లతోపాటు వారి కుటుంబ సభ్యులు కొవిడ్ బారిన పడే ప్రమాదమున్నందున నెలాఖరు వరకు సెలవులు ప్రకటించా లన్నారు. టీడీపీ నాయకులు కర్రి వెంకటరామారెడ్డి, నల్ల మిల్లి సుబ్బారెడ్డి పాల్గొన్నారు.