ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు
ABN , First Publish Date - 2022-08-19T05:51:51+05:30 IST
స్థానిక వడ్లమూడిలోని విజ్ఞాన్ విశ్వవిద్యాలయంలో గురువారం శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా ని ర్వహించారు.
గుంటూరు(విద్య), ఆగస్టు 18: స్థానిక వడ్లమూడిలోని విజ్ఞాన్ విశ్వవిద్యాలయంలో గురువారం శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా ని ర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజ రైన విజ్ఞాన్ విద్యాసంస్థల వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ జీవితంలో ప్రతి విజ యానికి సమష్టి కృషి ఎంతో అవ సరమని తెలిపారు. ఈ సందర్భం గా ఉట్టికొట్టే కార్యక్రమంలో ఉత్సా హంగా విద్యార్థులు పాల్గొన్నారు.
కేఎల్పీ స్కూల్లో..
భారతీయ సంస్కృతీ, సంప్రదా యాల్ని విద్యార్థులు గౌరవించాలని కేఎల్పీ పబ్లిక్ స్కూల్ కార్యదర్శి డాక్టర్ కొండబోలు కృష్ణప్రసాద్ అన్నారు. గురు వారం పాఠశాలలో నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకల్లో ఆయన మాట్లాడారు. భగవద్గీత శ్లోకాల ప్రాధాన్యత, వాటి విశిష్టత గురించి ఆయన వివరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యార్థిని విద్యార్థుల వేష ధారణలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రధినిచౌదరి పాల్గొన్నారు.
సుమేధ స్కూల్లో..
స్థానిక ఎన్జీవోకాలనీలోని సుమేధ స్కూల్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డైరెక్టర్ మున్నంగి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ దుష్టశిక్షణ, శిష్ట రక్షణ కోసం శ్రీకృష్ణుడు అనుసరించిన విధానాలు తెలియజేయడంతోపాటు ఆయ న జయంతిని ఘనంగా నిర్వహించుకోవడమే కృష్ణాష్టమి లక్ష్యమని పేర్కొన్నారు.