శాస్త్రోక్తంగా మట్టపల్లివాసుడి కల్యాణం

ABN , First Publish Date - 2021-10-24T06:48:33+05:30 IST

రాష్ట్రంలో రెండో యాదాద్రిగా పేరొందిన మట్టపల్లి లక్ష్మీనృసింహుడి క్షేత్రంలో స్వామివారి నిత్య కల్యాణాన్ని అర్చకులు శనివారం శాస్త్రోక్తంగా నిర్వహించారు.

శాస్త్రోక్తంగా మట్టపల్లివాసుడి కల్యాణం

మఠంపల్లి, అక్టోబరు 23: రాష్ట్రంలో రెండో యాదాద్రిగా పేరొందిన మట్టపల్లి లక్ష్మీనృసింహుడి క్షేత్రంలో స్వామివారి నిత్య కల్యాణాన్ని అర్చకులు శనివారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయంలో విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం, రక్షాబంధనం, పంచగవ్యప్రాసన, మాంగల్యధారణ, తలంబ్రాల తంతును వైభవంగా నిర్వహించారు. అనంతరం నీరాజన మంత్రపుష్పాలతో మహానివేదన చేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త చెన్నూరి మట్టపల్లిరావు, విజయ్‌కుమార్‌, ఈవో సిరికొండ నవీన్‌, అర్చకులు తూమాటి శ్రీనివాసాచార్యులు, పద్మనాభాచార్యులు, కృష్ణామాచార్యులు, రామాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, నరసింహ మూర్తి, లక్ష్మీనరసింహమూర్తి, సీతారామశాస్త్రీ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-24T06:48:33+05:30 IST