వాతావరణ మార్పుల వల్లే తెగుళ్లు

ABN , First Publish Date - 2021-10-27T05:04:55+05:30 IST

వాతావరణంలో తరచూ వస్తున్న మార్పుల వల్లే వరి పంటకు తెగుళ్లు ఎక్కువగా వస్తున్నాయని మార్టేరు వరి పరిశోధన శాస్త్రవేత్తలు అన్నారు.

వాతావరణ మార్పుల వల్లే తెగుళ్లు
పంట చేలను పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు

 వరి పంటలో తెగుళ్లపై శాస్త్రవేత్తలు


ఆచంట, అక్టోబరు 26 : వాతావరణంలో తరచూ వస్తున్న మార్పుల వల్లే వరి పంటకు తెగుళ్లు ఎక్కువగా వస్తున్నాయని మార్టేరు వరి పరిశోధన శాస్త్రవేత్తలు అన్నారు. ఆచంట మండలం పెనుమంచిలిలో జరిగిన రైతు సదస్సులో శాస్త్రవేత్తలు సీహెచ్‌.శ్రీనివాసు, నంద కిషోర్‌, మానుకొండ శ్రీనివాసరావు  వరి పంటలో వచ్చే చీడ పీడలపై రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఎరువులు విచక్షణా రహితంగా వాడడం వల్ల కూడా పంట దిగుబడులు తగ్గిపోతాయన్నారు. సార్వాకు యూరియా వాడవద్దని.. దాళ్వా పంటకు మాత్రమే ఎక్కువ యూరియా వాడాలన్నారు. ఈ సదస్సులో పలువురు రైతులు ఆర్కేస్ట్రా మందు ప్రతినిధులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-27T05:04:55+05:30 IST