‘మీ భూమి’కి స్కోచ్‌ అవార్డు

ABN , First Publish Date - 2022-04-14T09:02:17+05:30 IST

ఏపీ రెవెన్యూశాఖకు స్కోచ్‌ అవార్డు లు దక్కాయి. పట్టా, ప్రభుత్వ భూముల వివరాలు తెలియజేసే ‘మీ భూమి’ పోర్టల్‌ను ఏపీ రెవెన్యూశాఖ నిర్వహిస్తోంది.

‘మీ భూమి’కి స్కోచ్‌ అవార్డు

భూశోధక్‌కు ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌ అవార్డు


అమరావతి, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): ఏపీ రెవెన్యూశాఖకు స్కోచ్‌ అవార్డు లు దక్కాయి. పట్టా, ప్రభుత్వ భూముల వివరాలు తెలియజేసే ‘మీ భూమి’ పోర్టల్‌ను ఏపీ రెవెన్యూశాఖ నిర్వహిస్తోంది. ఈ-గవర్నెన్స్‌ విభాగం కింద దీనికి సిల్వర్‌ మెడల్‌ లభించింది. కౌలుదారు గుర్తింపు కార్డులు(సీసీఆర్‌), పేద కుటుంబాలకు ఇంటిస్థలాలు, భూశోధక్‌ డిజిటల్‌ ప్రాజెక్టులను ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌ అవార్డులు వరించాయి. స్కోచ్‌ సంస్థ నిర్వహించిన వెబినార్‌లో భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌.. స్కోచ్‌ అవార్డులను స్వీకరించారు. ఈ వె బినార్‌లో రెవెన్యూశాఖ మొత్తం 9 ప్రాజెక్టులపై ప్రజంటేషన్లు ఇచ్చింది.  భూ శోధక్‌ ప్రాజెక్టును జనవరిలో ప్రారంభించారు. ఇది రైతుల వద్ద ఉన్న భూమి పత్రాల ఒరిజినాలిటీని బార్‌ కోడింగ్‌ ఆధారంగా నిర్ధారించనుంది.

Updated Date - 2022-04-14T09:02:17+05:30 IST