సందిగ్ధతకు త్వరలో తెర

ABN , First Publish Date - 2022-05-16T05:46:40+05:30 IST

పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇన్‌చార్జి అంశంపై నెలకొన్న సందిగ్ధతకు రెండు, మూడు రోజులలో తెర పడనుందని మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్‌ అన్నారు.

సందిగ్ధతకు త్వరలో తెర
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్‌

‘వైసీపీ పశ్చిమ ఇన్‌చార్జి’ అంశంపై ‘మళ్ల’

సీఎంతో భేటీ కానున్నట్టు వెల్లడి

మల్కాపురం, మే 15: పశ్చిమ నియోజకవర్గం వైసీపీ  ఇన్‌చార్జి అంశంపై నెలకొన్న సందిగ్ధతకు రెండు, మూడు రోజులలో తెర పడనుందని మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్‌ అన్నారు. ఆదివారం నగరంలోని తన నివాసంలో నియోజకవర్గానికి చెందిన వైసీపీ కార్పొరేటర్లు, వార్డుల అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో విజయప్రసాద్‌ మాట్లాడుతూ  పార్టీ రీజనల్‌ కో-ఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి సమక్షంలో  సోమవారం అమరావతిలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో  సమావేశం కానున్నట్టు వెల్లడించారు. తొమ్మిదేళ్లుగా పార్టీని బలోపేతం చేసినందుకు కృషి చేసిన తనకు అన్యాయం జరగదనే ఆశాభావం ఆయన వ్యక్తంచేశారు. తనపై కొంతమంది తప్పుడు ప్రచారం చేశారని ఆయన వివరించారు. ఈ సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్‌ దాడి సత్యనారాయణ, వైఎస్సార్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు కలిదిండి బద్రీనాథ్‌,  జీవీఎంసీ కో-ఆప్షన్‌ సభ్యుడు బెహరా భాస్కరరావు, కార్పొరేటర్లు పీవీ సురేశ్‌, కొణతాల సుఽధ, జి.లావణ్య, బల్ల లక్ష్మణరావు, గుండపు నాగేశ్వరరావు, పుర్రె పూర్ణశ్రీ, టీడీపీ కార్పొరేటర్‌ గల్లా పోలిపల్లి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-16T05:46:40+05:30 IST