SDRF rescues: వరదల్లో చిక్కుకున్న ఆది కైలాష్ యాత్రికులకు కాపాడిన ఎస్డిఆర్ఎఫ్
ABN , First Publish Date - 2022-09-22T17:52:03+05:30 IST
భారీవర్షాలతో వరదలు వెల్లువెత్తి రోడ్లు బ్లాక్ అవడంతో ఆది కైలాష్ యాత్రికులను స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(state disaster response force) రక్షించింది....
న్యూఢిల్లీ: భారీవర్షాలతో వరదలు వెల్లువెత్తి రోడ్లు బ్లాక్ అవడంతో ఆది కైలాష్ యాత్రికులను స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(state disaster response force) రక్షించింది.(rescues) తవాఘాట్ వద్ద చిక్కుకు పోయిన 42 మంది ఆదికైలాష్ యాత్రికులను(Adi Kailash pilgrims) ఎస్డిఆర్ఎఫ్ బృందం మరో మార్గంలో సురక్షిత ప్రాంతానికి తరలించింది. ఆదికైలాష్ యాత్రికులను ధార్చులా మీదుగా తరలించామని జిల్లా మెజిస్ట్రేట్ ఆశిష్ చౌహాన్ చెప్పారు. ఆదికైలాష్ యాత్రికుల్లో ఎక్కువమంది రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఢిల్లీ వాసులని అధికారులు చెప్పారు. వ్యాస్ లోయలో 50మంది గ్రామస్థులను హెలికాప్టర్ల(helicopters) ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు.