సీజనల్ ఫ్రూట్స్తో ఆరోగ్యం!
ABN , First Publish Date - 2020-11-05T05:30:00+05:30 IST
చలికాలంలో జలుబు, దగ్గు, జ్వరం వంటి చిన్నచిన్న అనారోగ్యాలు ఎక్కువగా వేధిస్తుంటాయి. రోగనిరోధకశక్తిని పెంచుకోవడం ద్వారా ఈ సమస్యలు దరిచేరకుండా చూసుకోవచ్చు...
చలికాలంలో జలుబు, దగ్గు, జ్వరం వంటి చిన్నచిన్న అనారోగ్యాలు ఎక్కువగా వేధిస్తుంటాయి. రోగనిరోధకశక్తిని పెంచుకోవడం ద్వారా ఈ సమస్యలు దరిచేరకుండా చూసుకోవచ్చు. అందుకోసం గ్రీన్ టీ, జింజర్ టీ వంటి ఇమ్యూనిటీ డ్రింక్స్తో పాటు ఈ సీజన్లో దొరికే జామ, నారింజ, బత్తాయి పండ్లు ఎక్కువగా తినాలి. ఈ పండ్లలోని విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యాన్ని పెంచుతాయి.
జామ: నోరూరించే జామ పండ్లలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఒంట్లోని ఫ్రీరాడికల్స్ను తొలగించి, కణాలు దెబ్బతినకుండా చూస్తాయి. ఈ పండులోని పీచుపదార్థం రక్తంలో చక్కెర స్థాయుల్ని అదుపులో ఉంచుతుంది. గుండెకు మేలు చేస్తుంది.
నారింజ: ఈ నిమ్మజాతి పండులో విటమిన్ సి, కాల్షియం ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి సీజనల్ ఇన్ఫెక్షన్లను దూరం చేస్తాయి. రోజూ ఒక నారింజ పండు తింటే అనారోగ్యం దరిచేరకుండా ఉంటుంది.
యాపిల్: ఈ పండు ఇన్ఫ్లమేషన్ను తగ్గించి, రోగనిరోధకశక్తిని మెరుగుపరుస్తుంది. దీనిలోని పెక్టిన్ ఫైబర్ , విటమిన్ సి, కె ఇమ్యూనిటీని పెంచుతాయి.
బత్తాయి: విటమిన్ సి ఎక్కువగా ఉండే పండు తింటే రోగనిరోధకశక్తి పెరుగుతుంది. జీర్ణశక్తి మెరుగవుతుంది. బత్తాయి శ్వాసపరమైన సమస్యలను తగ్గిస్తుంది. బరువు తగ్గడంలో సాయపడుతుంది.