భారీగా కర్నాటక మద్యం పట్టివేత
ABN , First Publish Date - 2020-11-29T05:36:09+05:30 IST
ఎస్ఈబీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంత్రాలయం మండంలం వగరూరు, రచ్చుమర్రి గ్రామాల వద్ద రూ. లక్ష విలువ చేసే కర్నాటక మద్యాన్ని స్వాదీనం చేసుకున్నట్లు ఎమ్మిగనూరు సీఐ మహెష్ కుమార్ తెలిపారు.
- 1400 పాకెట్లు, రెండు బైక్లు స్వాధీనం
ఎమ్మిగనూరు, నవంబరు 28: ఎస్ఈబీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంత్రాలయం మండంలం వగరూరు, రచ్చుమర్రి గ్రామాల వద్ద రూ. లక్ష విలువ చేసే కర్నాటక మద్యాన్ని స్వాదీనం చేసుకున్నట్లు ఎమ్మిగనూరు సీఐ మహెష్ కుమార్ తెలిపారు. శనివారం స్టేషన్లో విలేఖరులతో వగరూరుకు చెందిన బోయ వెంకటేష్, రచ్చుమర్రికి చెందిన బోయ రామాంజనేయులు, మజ్జిగ బొజ్జన్న కర్నాటక నుంచి బైక్లపై రూ.లక్ష విలువ చేసే 1400 టెట్రాపాకెట్లను, బైక్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మజ్జిగ బొజ్జప్పను అరెస్టు చేశామని, తీసకున్నామని, బోయ వెంకటేశ్, బోయ రామాంజనేయులు తప్పించుకున్నారని కేసు నమొదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
అక్రమంగా మద్యం, ఇసుక అక్రమ రవాణా, మట్కా, గుట్కా, ఆన్లైన్ గ్యాంబ్లింగ్, ఆఫ్లైన్ గ్యాంబ్లింగ్, ఎర్రచందనం నిందితులపై పీడీ యాక్టు నమోదు చేస్తామని సీఐ హెచ్చరించారు. ఎస్ఐ సరస్వతి, సిబ్బంది పాల్గొన్నారు.