ఇసుక అక్రమ రవాణాపై అధికారుల దాడులు

ABN , First Publish Date - 2021-01-24T07:12:03+05:30 IST

మండలంలోని తోకపల్లి గ్రామంలో ఇసుక అక్రమంగా రవాణా సాగిస్తున్న వారిపై ఎస్‌ఈబీ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు.

ఇసుక అక్రమ రవాణాపై అధికారుల దాడులు

పెద్దారవీడు, జనవరి 23: మండలంలోని తోకపల్లి గ్రామంలో ఇసుక అక్రమంగా రవాణా సాగిస్తున్న వారిపై ఎస్‌ఈబీ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. దర్శి ఎస్‌ఈబీ సీఐ రాజేంద్ర ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం తోకపల్లి గ్రామంలో నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న 40 టన్నుల ఇసుకను రెండు టిప్పర్‌ లను సీజ్‌ చేసి స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు. ఎవరైనా అక్రమంగా ఇసుక రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎర్రగొండపాలెం ఎస్‌ఈబీ ఎస్‌ఐ రఘు, మార్కాపురం ఎస్‌ఈబీ రవికుమార్‌, సూపరింటిండెంట్‌ ఆవులయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-24T07:12:03+05:30 IST