విజయా డయాగ్నోస్టిక్ ఐపీఓకు సెబీ ఆమోదం
ABN , First Publish Date - 2021-07-27T05:57:47+05:30 IST
హైదరాబాద్కు చెందిన విజయా డయాగ్నోస్టిక్ సెంటర్తో పాటు మరో 5 కంపెనీల పబ్లిక్ ఆఫరింగ్
మరో 5 కంపెనీలకూ గ్రీన్సిగ్నల్
న్యూఢిల్లీ: హైదరాబాద్కు చెందిన విజయా డయాగ్నోస్టిక్ సెంటర్తో పాటు మరో 5 కంపెనీల పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ప్రతిపాదనలకు క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి ‘సెబీ’ ఆమోదం తెలిపింది. ఈ జాబితాలో కార్ట్రేడ్ టెక్, సుప్రియా లైఫ్ సైన్సెస్, యాప్టస్ వేల్యూ హౌసింగ్ ఫైనాన్స్, క్రిష్ణా డయాగ్నోస్టిక్స్, అమీ ఆర్గానిక్స్ ఉన్నాయి. ఈ ఆరు కంపెనీలు మే-జూన్ మధ్య కాలంలో సెబీకి ఐపీఓ పత్రాలు సమర్పించాయి.
ఐపీఓలో భాగంగా విజయా డయాగ్నోస్టిక్ ప్రమోటర్లు ఎస్ సురేంద్రనాథ్ రెడ్డి, ఇన్వెస్టర్లు కారకోరమ్, కేదారా క్యాపిటల్కు చెందిన 3.57 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎ్ఫఎస్) పద్ధతిన విక్రయించనున్నారు. ఈ షేర్లు కంపెనీలో 35 శాతం వాటాకు సమానం. అందులో 30 శాతం వాటాను కేదారా క్యాపిటల్ ఉపసంహరించుకోనుంది. కేదారా క్యాపిటల్ ఈ డయాగ్నోస్టిక్ సెంటర్లో 40 శాతం వాటాను రూ.400 కోట్లకు 2016లో కొనుగోలు చేసింది. 1981లో ప్రారంభమైన విజయా డయాగ్నోస్టిక్కు దేశంలోని 13 నగరాల్లో 80 అధునాతన పరీక్షా కేంద్రాలున్నాయి.
ఈ వారంలో రెండు పబ్లిక్ ఇష్యూలు
జూలైలో ఐపీఓల జోరు కొనసాగుతోంది. ఈ వారంలో గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్, రోలెక్స్ రింగ్స్ పబ్లిక్ ఇష్యూకు రాబోతున్నాయి. గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్ ఇష్యూ ఈ నెల 27న ప్రారంభమై 29న ముగియనుంది. ఇష్యూ ధర శ్రేణిని రూ.695-720గా నిర్ణయించిన కంపెనీ.. తద్వారా రూ.1,513 కోట్ల వరకు సమీకరించాలని లక్ష్యం గా పెట్టుకుంది. కాగా రోలెక్స్ రింగ్స్ ఐపీఓ ఈ నెల 28న ప్రారంభమై 30న ముగియనుంది. ఇష్యూ ధర శ్రేణిని రూ.880-900గా నిర్ణయించింది. తద్వారా రూ.731 కోట్లు సమీకరించాలన్నది కంపెనీ లక్ష్యం.
అక్టోబరు చివర్లో పేటీఎం ఐపీఓ!
దేశంలో అతిపెద్ద డిజిటల్ చెల్లింపుల సేవల కంపెనీ పేటీఎం.. ఈ ఏడాది అక్టోబరు చివర్లో పబ్లిక్ ఇష్యూకు రానున్నట్లు సమాచారం. సంస్థ ఐపీఓ ప్రతిపాదనకు ఇంకా సెబీ ఆమోదం లభించాల్సి ఉంది. పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా కంపెనీ రూ.16,600 కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా దేశంలో అతిపెద్ద ఐపీఓగా అవతరించనుంది.