కౌంటర్లు వేయనందుకు ఎస్ఈసీ క్షమాపణ
ABN , First Publish Date - 2021-03-06T09:30:28+05:30 IST
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలతో ముడిపడిన వ్యాజ్యాలకు సంబంధించిన విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. గడచిన గురువారం నాటికే కౌంటర్లు
ఎంపీటీసీ, జడ్పీటీసీ వ్యాజ్యాలపై విచారణ ఎల్లుండికి వాయిదా
అమరావతి, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలతో ముడిపడిన వ్యాజ్యాలకు సంబంధించిన విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. గడచిన గురువారం నాటికే కౌంటర్లు వేస్తామన్న రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ).. సమయానికి దాఖలు చేయలేకపోయింది. ఇందుకు గాను శుక్రవారం కోర్టుకు క్షమాపణ చెప్పింది. శుక్రవారం మధ్యాహ్నానికి కౌంటర్లు దాఖలు చేస్తామని.. ఆ తర్వాత విచారణ జరపాలని ఎస్ఈసీ తరఫు న్యాయవాది అశ్వనీకుమార్ కోరారు. అయితే మధ్యాహ్నం సాధ్యపడదన్న న్యాయమూర్తి జస్టిస్ డీవీఎ్సఎస్ సోమయాజులు.. విచారణను 8వ తేదీకి వాయిదా వేశారు.