సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ ఆఫీస్లో అగ్నిప్రమాదం
ABN , First Publish Date - 2022-01-12T22:19:21+05:30 IST
సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ ఆఫీస్లో అగ్నిప్రమాదం
హైదరాబాద్: సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ ఆఫీస్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మూడో అంతస్తులో భారీగా మంటలు చెలరేగాయి. దాంతో పొగ దట్టంగా అలుముకుంది. ఈ ప్రమాదంతో సిబ్బంది భయంతో పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకన్నారు. అగ్నిమాపక సిబ్బంది రాకతో మంటలు అదుపులోకి వచ్చాయి. ఈ అగ్నిప్రమాదంలో పలు పత్రాలు దగ్ధమైయ్యాయి. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని అధికారులు చెబుతున్నారు.