రెండో రోజు ఎన్పీఎల్ క్రికెట్ పోటీలు
ABN , First Publish Date - 2021-01-25T03:15:39+05:30 IST
ఎంజేఆర్ ట్రస్టు ఆధ్వ ర్యంలో జిల్లా కేంద్రంలో మూడు రోజుల పాటు నిర్వహిస్తు న్న నాగర్కర్నూల్ ప్రీమియర్ లీగ్(ఎన్పీఎల్)టోర్నమెంట్ రెండో రోజు ఆదివారం మ్యాచ్లు నిర్వహించగా పోటీలో ప లు జట్లు విజేతలుగా నిలిచాయి.
- తలపడిన ఐదు జట్లు
- మ్యాచ్ను తిలకించిన ఎమ్మెల్యే మర్రి
నాగర్కర్నూల్ టౌన్, జనవరి 24: ఎంజేఆర్ ట్రస్టు ఆధ్వ ర్యంలో జిల్లా కేంద్రంలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న నాగర్కర్నూల్ ప్రీమియర్ లీగ్(ఎన్పీఎల్)టోర్నమెంట్ రెండో రోజు ఆదివారం మ్యాచ్లు నిర్వహించగా పోటీలో పలు జట్లు విజేతలుగా నిలిచాయి. ఐదో మ్యాచ్ను ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి తిలకించారు. పోలీసు-మునిసిపల్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో పోలీసు జట్టు విజయం సాధిం చింది. రెండో మ్యాచ్లో ఎక్సైజ్ జట్టుపై వేల్పేర్ జట్టు, మూడో మ్యాచ్లో జడ్పీ జట్టుపై ఫారెస్టు జట్టు, నాలుగో మ్యా చ్లో ఎలక్ట్రికల్ టీంపై టీచర్స్ జట్టు, ఐదో మ్యాచ్లో ఎంజే ఆర్ యూత్ జట్టుపై విషన్ టీం విజయం సాధించాయి. ఎంజేఆర్ ట్రస్టు డైరెక్టర్, డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునంద న్రెడ్డి, జడ్పీటీసీ శ్రీశైలం, సీఐ గాంధీనాయక్, ఎక్సైజ్ సీఐ ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.