Nellore: బిల్లులు చెల్లించలేదని సచివాలయానికి తాళం

ABN , First Publish Date - 2022-07-08T17:30:22+05:30 IST

బిల్లులు చెల్లించలేదని గ్రామ సచివాలయానికి వైసీపీ కాంట్రాక్టర్ తాళం వేశారు.

Nellore: బిల్లులు చెల్లించలేదని సచివాలయానికి తాళం

నెల్లూరు (Nellore: బిల్లులు చెల్లించలేదని గ్రామ సచివాలయానికి వైసీపీ కాంట్రాక్టర్ (YCP Contractor) తాళం వేశారు. పనులు పూర్తి కావచ్చినా సగం బిల్లు కూడా చెల్లించలేదని నిరసన తెలిపారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా, ఓజిలి మండలంలో చోటు చేసుకుంది. మాచవరంలో పంచాయతీ భవన నిర్మాణానికి రూ. 25 లక్షలతో చేపట్టిన.. స్టేజ్ 2 సచివాలయ భవన నిర్మాణ పనులను వైసీపీ సీనియర్ నాయకుడు, కాంట్రాక్టర్ పుల్లారెడ్డి చేపట్టారు. నిర్మాణ పనులు దాదాపు 90 శాతం పూర్తి అయినప్పటికీ... కేవలం రూ. 9 లక్షలు మాత్రమే బిల్లులు చెల్లించారు. పెండింగ్ బిల్లుల కోసం ఎమ్మెల్యేలతోపాటు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం కనిపించకపోవడంతో విసిగిపోయిన పుల్లారెడ్డి సచివాలయ భవనానికి తాళం వేశారు.


దీంతో సచివాలయంలో పనిచేసే సిబ్బంది కొంత సేపు రోడ్డుపైనే నిలబడాల్సి వచ్చింది. విషయాన్ని ఎమ్మెల్యే సంజీవయ్య దృష్టికి తీసుకువెళ్లగా కాంట్రాక్టర్ పుల్లారెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో కాంట్రాక్టర్ సచివాలయ సిబ్బందికి తాళాలు అప్పగించారు. అధికారపార్టీకి చెందిన కాంట్రాక్టర్ సచివాలయ భవనానికి తాళం వేయడం చర్చనీయాంశంగా మారింది. 

Updated Date - 2022-07-08T17:30:22+05:30 IST