మెరుగైన సేవల కోసమే సచివాలయాలు
ABN , First Publish Date - 2021-07-27T04:54:53+05:30 IST
ప్రజలకు మెరుగైన సేవల కోసమే గ్రామ సచివాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని స్థానిక ఎమ్మెల్యే సుధీర్రెడ్డి పేర్కొన్నారు.
మైలవరం, జూలై 26 : ప్రజలకు మెరుగైన సేవల కోసమే గ్రామ సచివాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని స్థానిక ఎమ్మెల్యే సుధీర్రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని తలమంచిపట్నం, మైలవరంలలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాల భవనాలను ఎమ్మెల్యే సోమవారం ప్రారంభించి ఏమైనా సమస్యలున్నాయా? అని ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తహసీల్దారు తిరుపతయ్య, ఎంపీడీవో రామచంద్రారెడ్డి, మార్కె ట్ యార్డు చైర్మన్ శివగురివిరెడ్డి, సర్పంచులు చం ద్ర శేఖర్రెడ్డి, సోనూబాయ్, వైసీపీ నాయకులు మహేశ్వరరెడ్డి, వినయ్కుమార్రెడ్డి, విష్ణువర్దన్రెడ్డి సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.