నేటి నుంచి సెక్షన్‌ 22ఏ మేళా

ABN , First Publish Date - 2022-06-25T06:20:40+05:30 IST

నిషేధిత భూముల జాబితా సెక్షన్‌ 22ఏ జాబితాలో ఉన్న భూముల తొలగింపు మేళాలో సమస్యలు పరిష్కరించుకోవాలని ఆర్డీవో రవీంద్రరావు సూచించారు.

నేటి నుంచి సెక్షన్‌ 22ఏ మేళా
మాట్లాడుతున్న ఆర్డీవో రవీంద్రరావు

ఆర్డీవో రవీంద్రరావు

 నందిగామ, జూన్‌ 24: నిషేధిత భూముల జాబితా సెక్షన్‌ 22ఏ జాబితాలో ఉన్న భూముల తొలగింపు మేళాలో సమస్యలు పరిష్కరించుకోవాలని ఆర్డీవో రవీంద్రరావు సూచించారు. శుక్రవారం  విలేకర్లతో మాట్లాడుతూ,  అసైన్డ్‌ కాబడిన భూములు, చుక్కల భూములతో పాటు రోడ్లు, ఎన్‌ఎస్‌పీ కాల్వల కోసం భూసేకరణ చేసిన భూముల్లో మిగిలిన భూమి కూడా ఆయా శాఖల పరిధిలోకి పొరపాటున చేరాయని, అటువంటి  సమస్యలకు సత్వర పరిష్కారం చేపట్టేందుకు మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భూములకు సంబందించిన  రికార్డులతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తులను ఆయా మండల తహసీల్దార్‌ కార్యాలయాల్లో, తన కార్యాయలంలో గానీ, కలెక్టర్‌ కార్యాలయంలో గానీ అందజేయాలని ఆర్డీవో సూచించారు.  


Updated Date - 2022-06-25T06:20:40+05:30 IST