సెక్యులరిజమే భారత్‌ను ఎదగనీయకుండా చేస్తోంది : సీఎం యోగి

ABN , First Publish Date - 2021-03-08T21:27:47+05:30 IST

దేశానికి సెక్యులరిజమే అతిపెద్ద ముప్పు అని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. కొందరు డబ్బుల కోసం దేశం గురించి

సెక్యులరిజమే భారత్‌ను ఎదగనీయకుండా చేస్తోంది : సీఎం యోగి

లక్నో : దేశానికి సెక్యులరిజమే అతిపెద్ద ముప్పు అని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. కొందరు డబ్బుల కోసం దేశం గురించి తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘గ్లోబల్ ఎన్‌సైక్లోపీడీయా ఆఫ్ ది రామాయణ’’ అన్న కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘‘దేశానికి లౌకికవాదం అతిపెద్ద ముప్పు. ఈ ముప్పు ప్రపంచ యవనికపై భారత్‌ను ఎదగనీయకుండా చేస్తోంది. కొన్ని స్వార్థ శక్తులు తమ స్వప్రయోజనాల కోసం ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. దేశానికి తీరని ద్రోహం చేస్తున్నారు. వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దు. డబ్బుల కోసం దేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేసే వారు తగిన మూల్యం చెల్లించాల్సిందే.’’ అని యోగి స్పష్టం చేశారు. ఇప్పటికీ కొందరు రాముడి ఉనికిని ప్రశ్నించే వారున్నారని అన్నారు. చిన్న చిన్న మత వివాదాలు చేస్తూ, దేశ సామరస్యపూర్వక వాతావరణాన్ని దెబ్బతీయవద్దని యోగి హితవు పలికారు. 

Updated Date - 2021-03-08T21:27:47+05:30 IST