సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో దారుణం
ABN , First Publish Date - 2021-08-16T23:44:52+05:30 IST
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో దారుణం
సికింద్రాబాద్: గాంధీ ఆస్పత్రిలో దారుణం జరిగింది. బావ చికిత్స కోసం వచ్చిన అక్కాచెల్లెల్లపై సిబ్బంది అత్యాచారానికి పాల్పడ్డారు. గదిలో బంధించి మత్తు మందు ఇచ్చి నాలుగు రోజులుగా ఘాతుకానికి ఒడిగట్టారు. గది నుంచి చెల్లి తప్పించుకోగా అక్క ఆచూకీ లేదు. దీంతో చిలకలగూడ పీఎస్లో బాధితురాలు ఫిర్యాదు చేశారు. ల్యాబ్ టెక్నీషియన్ ఉమామహేశ్వర్ అత్యాచారం చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఉమ మహేశ్వర్తో మరో ఇద్దరు గార్డులు అత్యాచారం చేసినట్లు అనుమానిస్తున్నారు. ల్యాబ్ టెక్నీషియన్ ఉమమహేశ్వర్ను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు.