సికింద్రాబాద్ విధ్వంసం వెనుక కీలక సూత్రధారి అరెస్ట్..!

ABN , First Publish Date - 2022-06-18T16:28:13+05:30 IST

సికింద్రాబాద్(Secunderabad) రైల్వే స్టేషన్(Railway Station) అటాక్ వెనక కుట్రకోణం వెలుగు చూసింది. పక్కా ప్రణాళికతోనే విధ్వంసం జరిగింది.

సికింద్రాబాద్ విధ్వంసం వెనుక కీలక సూత్రధారి అరెస్ట్..!

పల్నాడు‌ : సికింద్రాబాద్(Secunderabad) రైల్వే స్టేషన్(Railway Station) అటాక్ వెనక కుట్రకోణం వెలుగు చూసింది. అగ్నిపథ్ నిరసనల వెనుక కీలక సూత్రధారిని పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా ప్రణాళికతోనే విధ్వంసం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. అభ్యర్థులను నర్సారావుపేట(Narsaraopet)కు చెందిన ఆవుల సుబ్బారావు అనే వ్యక్తి రెచ్చగొట్టినట్టు పోలీసుల విచారణలో తెలిసింది. నరసరావుపేటలో సాయి డిఫెన్స్ అకాడమీకి సుబ్బారావు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. సొంతూరు ఖమ్మంలో సుబ్బారావు ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు.. అక్కడకు వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే సుబ్బారావును నరసరావుపేటకు తరలించారు. ఆయన ఆధ్వర్యంలోనే ఆందోళనకారులు వచ్చినట్లు గుర్తించారు. ప్రైవేట్ అకాడమీల సహకారంతోనే విద్యార్థులు విధ్వంసానికి పాల్పడ్డారు. అకాడమీల్లోనే కొంతమంది నిరసనకారులకు షెల్టర్ ఇచ్చినట్లు పోలీసులు తేల్చారు. విద్యార్థులకు వాటర్ బాటిల్స్, బటర్ మిల్క్‌, పులిహోర ప్యాకెట్లు.. ప్రైవేట్ ఆర్మీ కోచింగ్ అకాడమీలు సరఫరా చేసినట్టు తెలుస్తోంది. 10 ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీలకు చెందిన నిరసనకారులు పాల్గొన్నట్లు గుర్తించారు. 

Updated Date - 2022-06-18T16:28:13+05:30 IST