సికింద్రాబాద్ - తిరుపతి ప్రత్యేక రైళ్లు
ABN , First Publish Date - 2022-09-21T14:03:50+05:30 IST
సికింద్రాబాద్ - సుబేదార్గంజ్- తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణమధ్య రైల్వే అధికారు లు తెలిపారు
హైదరాబాద్: సికింద్రాబాద్ - సుబేదార్గంజ్- తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణమధ్య రైల్వే అధికారు లు తెలిపారు. సెప్టెంబర్ 22న సికింద్రాబాద్ నుంచి తిరుపతికి (07469), 23న తిరుపతి నుంచి సికింద్రాబాద్కు ప్రత్యేక రైళ్లు(07470)నడపనున్నట్టు రైల్వే అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 27 వరకు ప్రతి గురువారం సుబేదార్గంజ్ నుంచి సికింద్రాబాద్కు ప్రత్యేక రైలు (04121)నడుస్తుందన్నారు. సెప్టెంబర్ 30నుంచి అక్టోబర్ 28 వరకు ప్రతి శుక్రవారం సికింద్రాబాద్ నుంచి సుబేదార్గంజ్ వరకు ప్రత్యేక రైలు(04122)నడుస్తుందన్నారు. సెప్టెంబర్ 24న నాందేడ్ నుంచి తిరుపతి (07633), 25న తిరుపతి నుంచి నాందేడ్కు ప్రత్యేక రైళ్లు(07634)నడపనున్నట్టు తెలియజేశారు.