ఎంపీ నవనీత్ రాణా ఇంటి ముందు శివసేన కార్యకర్తల నిరసన

ABN , First Publish Date - 2022-04-23T16:18:11+05:30 IST

ముంబైలోని ఎంపీ నవనీత్ రాణా, బద్నేరా స్వతంత్ర ఎమ్మెల్యే రవి రాణాల ఇంటి ముందు శివసేన కార్యకర్తలు నిరసన తెలిపారు....

ఎంపీ నవనీత్ రాణా ఇంటి ముందు శివసేన కార్యకర్తల నిరసన

ముంబై: ముంబైలోని ఎంపీ నవనీత్ రాణా, బద్నేరా స్వతంత్ర ఎమ్మెల్యే రవి రాణాల ఇంటి ముందు శివసేన కార్యకర్తలు నిరసన తెలిపారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నివాసం మాతోశ్రీ ముందు తాము హనుమాన్ చాలీసాను పఠిస్తామని ఎంపీ నవనీత్ దంపతులు హెచ్చరించిన నేపథ్యంలో శనివారం శివసేన కార్యకర్తలు ఎంపీ ఇంటి ముందు నిరసన తెలిపారు. మాతోశ్రీ వెలుపల హనుమాన్ చాలీసాను పఠిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని సేన కార్యకర్తలు రానాను బెదిరించారు.మాతోశ్రీ వెలుపల హనుమాన్ చాలీసా పారాయణం చేస్తామని ఎంపీ నవనీత్ దంపతులు చెప్పడంతో ముంబై పోలీసులు శుక్రవారం ఎంపీ నవనీత్ రాణా, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రాణాలకు నోటీసు ఇచ్చారు.


రాణా దంపతులు శుక్రవారం ఉదయం ముంబై చేరుకున్నారు. అప్పటి నుంచి శివసేన కార్యకర్తలు మాతోశ్రీతో సహా ముంబైలోని వివిధ ప్రదేశాల్లో గుమిగూడారు.ఎంపీ దంపతులు తమ ఖర్ నివాసంలో ఉంటున్నారు. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ఉండేందుకు జోన్ 9 డీసీపీ మంజునాథ్ షెంగే దంపతులకు నోటీసులు అందించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే దంపతులే బాధ్యత వహించాల్సి ఉంటుందని పోలీసులు హెచ్చరించారు.


Updated Date - 2022-04-23T16:18:11+05:30 IST