Viral News: ఎయిర్పోర్టులో మహిళ కదలికలపై అనుమానం.. ప్రశ్నించిన అధికారులు.. చివరకు వైద్య పరీక్షల్లో షాకింగ్ నిజం..
ABN , First Publish Date - 2022-08-20T17:59:18+05:30 IST
ఎయిర్పోర్ట్.. ప్రయాణికులతో ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే అక్కడ పెద్ద మొత్తంలో భద్రతా బలగాలు పహారా కాస్తుంటాయి. ఈ క్రమంలోనే ఓ మహిళ కదలికలపై అక్కడి అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఆమె వద్దకు వెళ్లి, ప్రశ్నించా
ఇంటర్నెట్ డెస్క్: ఎయిర్పోర్ట్.. ప్రయాణికులతో ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే అక్కడ పెద్ద మొత్తంలో భద్రతా బలగాలు పహారా కాస్తుంటాయి. ఈ క్రమంలోనే ఓ మహిళ కదలికలపై అక్కడి అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఆమె వద్దకు వెళ్లి, ప్రశ్నించారు. ఎంతకూ నోరు మెదపకపోవడంతో.. వారి మరింత అనుమానం వ్యక్తం చేశారు. వైద్యుడిని సంప్రదించి.. ఆమెకు వైద్య పరీక్షలు జరిపించారు. ఈ క్రమంలోనే షాకింగ్ నిజం బయటపడింది. కాగా.. ఇంతకూ ఏం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే..
కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్(Netaji Subhas Chandra Bose International Airport)లో తాజాగా ఓ మహిళ(Woman) కదలికలను గమనించి సెక్యూరిటీ అధికారులు(Security) అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే ఆమె వద్దకు చేరుకుని.. పలు ప్రశ్నలు అడిగారు. అయితే సదరు మహిళ ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పకపోగా.. మరింత కంగారుపడింది. ఆమె వ్యవహారశైలి తేడాగా ఉండటంతో.. అధికారులు వైద్యుడిని సంప్రదించారు. ఆమెకు వైద్య పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో సంచలన నిజం బయటపడింది. ఆమె మర్మాంగాలలో పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఉందనే విషయం బయటపడంతో అధికారులు కంగుతిన్నారు. వెంటనే చిన్న శస్త్ర చికిత్స ద్వారా ఆమె మర్మాంగాల నుంచి డ్రగ్స్(drugs)ను బయటకు తీయించారు. అనంతరం రూ.1కోటి విలువ గల డ్రగ్స్ను సీజ్ చేసిన అధికారులు.. లోతుగా విచారించేందుకు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం(Viral News) సృష్టించింది.