నిరంతరం అధికారులు పరిశీలించాలి

ABN , First Publish Date - 2020-11-29T05:56:55+05:30 IST

అభివృ ద్ధి పనులను అధికారులు నిరంతరం పరిశీలించాలని అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ అన్నారు. ఎడపల్లి మండలంలో కొనసాగుతున్న రూర్బన్‌ పథకం పనులను శనివారం ఆయన పరిశీలించారు.

నిరంతరం అధికారులు పరిశీలించాలి
పనులపై సమీక్ష నిర్వహిస్తున్న అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌

నవీపేట(ఎడపల్లి), నవంబరు 28: అభివృ ద్ధి పనులను అధికారులు నిరంతరం పరిశీలించాలని అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ అన్నారు. ఎడపల్లి మండలంలో కొనసాగుతున్న రూర్బన్‌ పథకం పనులను శనివారం ఆయన పరిశీలించారు. అనంతరం మండల పరిషత్‌ కార్యాల యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయ న మాట్లాడారు. ఎడపల్లి మండలంలో 25 కో ట్ల రూపాయల వ్యయంతో 437 పనులను చే పట్టగా ఇప్పటి వరకు 121 మాత్రమే పూర్త య్యాయని అన్నారు. మిగిలిన పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్ర మంలో జడ్పీవైస్‌చైర్మన్‌ రజితయాదవ్‌, ఆర్డీవో రాజేశ్వర్‌, ఎంపీపీ శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

అదనపు కలెక్టర్‌కు ఫిర్యాదు

ఎడపల్లి సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శిపై శనివారం వార్డు సభ్యులు అదన పు కలెక్టర్‌ చంద్రశేఖర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామ పంచాయ తీ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నార ని వారు ఆరోపించారు.

Updated Date - 2020-11-29T05:56:55+05:30 IST