రైతులకు విత్తనాలపై అవగాహన కల్సిస్తున్న శాస్త్రవేత్తలు
తాండూరు, మే, 24: తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానంలో మంగళవారం విత్తన మేళా కార్యక్రమం జరిగింది. ఈ మేళాలో పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త, హెడ్డాక్టర్ సుధారాణి, ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ప్రవీణ్, శాస్త్రవేత్తలు డాక్టర్ సందీప్, మిన్ని, యమున, ఏఈవో హరి్షచందర్, రమేష్ తదితరులు రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ అధునాతన సాగు పద్దతులపై రైతులు అవగాహన పెంచుకోవాలన్నారు. కంది జంటసాళ్ల పద ్దతి, విత్తనశుద్ధి, అంతర పంటలు, కలుపు మందులు, కందిలో యాంత్రీకరణపై వివరించారు. ఈ మేళాలో రైతులు పాల్గొన్నారు.